2 పార్టీల 2 జిల్లా నాయకుల ఆదర్శ ప్రజా కలయిక, రాష్ట్ర నాయకులూ ఇలా సర్దుకుంటే - Politics - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2083 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2118 General Articles and views 1,879,107; 104 తత్వాలు (Tatvaalu) and views 226,042.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

2 పార్టీల 2 జిల్లా నాయకుల ఆదర్శ ప్రజా కలయిక, రాష్ట్ర నాయకులూ ఇలా సర్దుకుంటే

ఫోటోలో చూడండి, 2 పార్టీల, ఇద్దరు జిల్లా స్థాయి నాయకుల ఆదర్శ కలయిక, రాష్ట్ర నాయకులు కూడా ఇలా సర్దుకుంటే, ఖర్చు శ్రమ గొడవలు సిధాంతాలు తగ్గుతాయి కదా.

ఇలాగే జగన్, చంద్రన్న, లోకేషన్న , పవనన్న, వీరన్న కలసి ఉంటే, కలసి అన్ని పంచుకొంటూ, ప్రజా సంక్షేమం కోసం పాటుపడితే, ఇంక ఎన్నికల ఎందుకు? ఓట్ల లెక్కింపు ఎందుకు? ఎలక్షన్ ఖర్చులు ఎందుకు? ప్రచారం ఎందుకు? హాయిగా జనం అంతా, కలసి మెలసి ఉంటారు కదా, అని పలువురు భావిస్తున్నారు.

ప్రకాశం జిల్లా, ప్రస్తుత పలుకుబడి మంత్రి బాలినేని, గత ప్రభుత్వం లో ఇలాగే ప్రభ వెలిగిన మాజీ మంత్రి సిద్ధా గార్లు, కేవలం ప్రజా సంక్షేమం కోసమే ఇలా కలసారు. ప్రకాశం జిల్లా ని, రాష్ట్రంలో నెంబరు వన్ గా నిలబెట్టాలి అంటే, ఎలా, ఇంకేమి చెయ్యాలి, ఇంకేమి తేవాలి అని ఇరువురు, సుదీర్ఘ మంతనాలు జరిపారు అంట. సలహాలు కూడా తీసుకున్నారు అంట.

రేపు వైసీపీ ఓడి, ఒకవేళ తెదేపా గెలిచినా, ఇలాగే మరలా సఖ్యతగా ఉంటారు, ఇదంతా కేవలం ప్రజా సంక్షేమం కోసం మాత్రమేనంట. ఇందులో జగనన్న, చంద్రన్న పిచ్చి వాళ్ళు కాదు కదా, అంతా ఒకటే అని చాటింపు కానే కాదు అంట.

ఇందులో జగనన్న, చంద్రన్న లకు, అలాగే ఇరు పార్టీలకు, ఎటువంటి ద్రోహం లేదు అంట. తెదేపా ఎమ్మెల్యే లు అందరినీ మన లోకి లాగేసి, చంద్రన్న మీద సింపతీ పెంచి, వచ్చే ఎలక్షన్ లో తెదేపా ను గెలిపించే ఉద్దేశ్యం లేనే లేదంట.

కుదిరినప్పుడు భోజనం చేసి, వైసీపీ నాయకులు తో కలసి తిరిగినంత మాత్రాన, తెదేపా కు స్వామి విశ్వాస ద్రోహం కూడా లేదంట. మరలా టికెట్ పదవి గారంటీ నే అంట.

గ్రానైట్, గనుల పన్నులు, కొత్త పదవులు గురించి, అసలు చర్చకే రాలేదని రాబోదని, స్వార్ధ ప్రయోజనాలు లేనే లేవని, అభిమానులు అనుకుంటున్నారు.

ప్రజల సంక్షేమం కోసం, ఇలా ఉప్పు నిప్పులు అయిన, ఇరు పార్టీ ల నాయకులు కలసి భోజనాలు చేస్తుంటే, పిచ్చి అనుచరులు, పార్టీలు పేరు చెప్పుకుని, రోడ్లు మీద అరచుకోవడం, తిట్టుకోవడం అవసరం లేదని, అవసరాలకు ఎప్పుడైనా పార్టీలు జెండాలు మార్చవచ్చు అని, ఈ ఆదర్శ నాయకులు సందేశం, ప్రజలకు ఆనందకరంగా ఉందని, పలువురు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇలాగే మిగతా ఆస్సెంబ్లీ, పార్లమెంట్, రాష్ట్ర నాయకులు ఆదర్శ ప్రజా కలయిక పాటించాలని అందరూ కోరుతున్నారు.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2118 General Articles and views 1,879,107; 104 తత్వాలు (Tatvaalu) and views 226,042
Dt : 16-Nov-2020, Upd Dt : 16-Nov-2020, Category : Politics
Views : 721 ( + More Social Media views ), Id : 815 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : ideal , meet , prakasam , district , leaders , tdp , ycp , state , leaders adjust , balineni , sidda
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content