1.
కారు లేని అబ్బాయికి ఎవరూ పిల్లను ఇవ్వడం లేదు.. డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు - 2025-10-29T18:46:08+05:30
కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్.. పెళ్లిళ్ల గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి. అబ్బాయికి కారు లేకుంటే పెళ్లి చేసుకోవడానికి ఎవరూ ముందుకు రారని పేర్కొన్నారు. బెంగళూరు నగరంలో టన్నెల్ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలు వెల్లడిస్తూ.. డీకే శివ కుమార్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇక ఈ వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ తీవ్రంగా స్పందించారు. దీంతో ఈ వ్యవహారం ఇప్పుడు కర్ణాటక రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది.
ఇంకా
2.
ప్రదీప్ రంగనాథన్ రేర్ ఫీట్.. ఆ ఘనత సాధించిన ఫస్ట్ ఇండియన్ హీరోగా రికార్డ్.. - 2025-10-29T19:26:46+05:30
కోలీవుడ్ డైరెక్టర్ కమ్ యాక్టర్ ప్రదీప్ రంగనాథన్ సంచలనం సృష్టించారు. వరుసగా మూడు బ్లాక్ బస్టర్ విజయాలు సాధించి, ఓ అరుదైన రికార్డు క్రియేట్ చేశారు. భారతీయ చిత్ర పరిశ్రమలో ఇప్పటివరకూ ఏ స్టార్ కిడ్ కూడా సాధించని, పెద్ద పెద్ద ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ నుంచి వచ్చిన హీరోలకు కూడా సాధ్యం కాని రికార్డ్ అందుకున్నారు. ఎటువంటి గాడ్ఫాదర్ లేకుండా తన సొంత టాలెంట్తో ఎదిగిన ప్రదీప్.. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని అభిమానులు ఆశిస్తున్నారు.
ఇంకా
3.
బిగ్బాస్: సుమన్ శెట్టి 2.ఓ.. తనూజని ఓ రేంజ్లో ఆడుకున్న అధ్యక్ష.. పొట్టచెక్కలు చేసిన ఇమ్మూ, సుమ్మూ - 2025-10-29T19:22:37+05:30
Bigg Boss 9 Telugu Today: కంటెస్టెంట్స్ బాలేదు.. ఎలిమినేషన్లు అయితే అంత గందరగోళం. ఎవరు వెళ్తున్నారో.. ఎవరు వస్తున్నారో.. అసలు ఎందుకు ఎలిమినేట్ చేస్తున్నారో.. మళ్లీ వాళ్లనే ఎందుకు హౌస్లోకి తీసుకొస్తున్నారో.. అసలు బిగ్ బాస్ గేమ్ ఎటు నుంచి ఎటు పోతుందో అర్థం కాని పరిస్థితి. బోయపాటి సినిమా కథల మాదిరిగా.. తీసిన కథనే మళ్లీ మళ్లీ తిప్పి తిప్పి తీస్తున్నట్టుగా బిగ్ బాస్ ఎలిమినేషన్లు కూడా అలాగే ఉంటున్నాయి.
ఇంకా
4.
బెంగళూరులో షాకింగ్ ఘటన.. గుడిలోకి చొరబడి విగ్రహం ధ్వంసం చేసిన బంగ్లాదేశ్ చొరబాటుదారుడు - 2025-10-29T19:14:23+05:30
దేశ ఐటీ రాజధాని నగరం బెంగళూరులో విస్తుగొలిపే ఘటన ఒకటి చోటు చేసుకుంది. భారత్లోకి అక్రమంగా ప్రవేశించి, బెంగళూరులో నివసిస్తున్న బంగ్లాదేశ్ జాతీయుడు, నగరం పక్కనే ఉన్న గ్రామంలో శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంపై దాడికి పాల్పడ్డాడు. ఫుల్లుగా తాగి గుడి ధ్వజస్తంభం, విగ్రహాలపై రాళ్లతో దాడి చేశాడు. భక్తులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. నిందితుడు కబీర్ మండల్ అక్రమ వలసదారుడని, అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇంకా
5.
ఫెడ్ దెబ్బకు సీన్ రివర్స్.. బంగారం ధరల్లో ఊహించని మార్పు.. చాలా రోజులకు ఇలా.. - 2025-10-29T18:35:17+05:30
US Fed Meeting Outcome: పసిడి ప్రియులకు షాక్ తగిలింది. గత 10 రోజులుగా భారీగా తగ్గిన బంగారం ధరలు ఒక్కసారిగా భారీగా పుంజుకున్నాయి. బుధవారం రోజు సీన్ రివర్స్ అయింది. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ కీలక వడ్డీ రేట్లను మరోసారి తగ్గించనున్నట్లు సంకేతాలు వచ్చాయి. ఇవాళ అర్ధరాత్రి దీనిపై ప్రకటన రానుంది. ఈ క్రమంలోనే పసిడి డిమాండ్ పెరగడంతో ఇన్వెస్ట్మెంట్లు పెరిగాయి. దీంతో ఇంటర్నేషనల్ మార్కెట్లో, దేశీయంగా రేట్లు పుంజుకున్నాయి.
ఇంకా
6.
తొలి టీ20 వర్షార్పణం.. భారత్, ఆస్ట్రేలియా మ్యాచ్ రద్దు - 2025-10-29T18:31:36+05:30
కాన్బెర్రా వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య జరగాల్సిన తొలి టీ20 మ్యాచ్ ఫలితం రాకుండానే ముగిసింది. భారత్ బ్యాటింగ్ చేస్తుండగా వర్షం పదే పదే అంతరాయం కలిగించింది. ఆ తర్వాత 9.4 ఓవర్ల వద్ద మరోసారి ఎంట్రీ ఇచ్చింది. ఎంతకీ తగ్గకపోవడంతో మ్యాచ్ను రద్దు చేసినట్లు అంపైర్లు ప్రకటించారు. అప్పటికీ భారత్ స్కోరు 97/1గా ఉంది. రెండో టీ20 మ్యాచ్ అక్టోబర్ 31న జరగనుంది.
ఇంకా
7.
ఆ జిల్లాలో వైసీపీకి షాక్.. ఉత్తర్వులు జారీ.. - 2025-10-29T18:33:41+05:30
విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపల్ ఛైర్మన్ స్థానాన్ని కోల్పోవాల్సి వచ్చింది. కౌన్సిల్ సమావేశాలు నిర్వహించకుండా అభివృద్ధికి అడ్డుపడుతున్నారనే ఆరోపణలపై కళ్యాణదుర్గం మున్సిపల్ ఛైర్మన్ తలారి రాజ్ కుమార్ను ప్రభుత్వం పదవి నుంచి తొలగించింది. ఆరోపణలపై నోటీసులు ఇచ్చినా స్పందించకపోవటంతోనే ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి.
ఇంకా
8.
మరీ ఇంత దారుణమా? టెక్ట్స్ మెసేజ్ల్లో ఉద్యోగుల లేఆఫ్స్ ప్రకటన.. ఒకేసారి వేలాది మంది! - 2025-10-29T17:59:22+05:30
Amazon Layoffs 30000: ఇ- కామర్స్ దిగ్గజ సంస్థ.. అమెజాన్ మరోసారి పెద్ద ఎత్తున ఉద్యోగుల లేఆఫ్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. 14 వేల కార్పొరేట్ ఉద్యోగాల్ని తొలగించనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఏఐపైనే ఎక్కువగా ఖర్చు చేస్తున్న క్రమంలో ఉద్యోగుల్ని తొలగిస్తోంది. అయితే.. ఇక్కడ అమెజాన్ వ్యవహరించే తీరు వివాదాస్పదమవుతోంది. ఉద్యోగులకు.. టెక్ట్స్ మెసేజ్లో లేఆఫ్స్ గురించి సమాచారం అందిస్తోంది. దీని గురించి పలువురు ఉద్యోగులు.. సోషల్ మీడియాల్లో పోస్టులు చేస్తున్నారు.
ఇంకా
9.
కార్తీక పౌర్ణమి వేళ అరుణాచలం గిరి ప్రదక్షిణకు వెళ్లే భక్తులకు గుడ్న్యూస్.. ప్రత్యేక బస్సులు - 2025-10-29T17:52:12+05:30
కార్తీక పౌర్ణమి సందర్భంగా అరుణాచలం వెళ్లే భక్తుల కోసం టీజీఎస్ఆర్టీసీ శుభవార్త చెప్పింది. హైదరాబాద్ నుంచి నేరుగా రవాణా సౌకర్యం లేక ఇబ్బంది పడుతున్న భక్తుల కోసం ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ప్రకటించింది. దిల్షుక్నగర్ నుంచి అరుణాచలం గిరి ప్రదక్షిణ మార్గం వరకు ప్రత్యేక బస్సు సర్వీసులను నడపనున్నట్లు వెల్లడించింది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నామని.. ఆన్లైన్ బుకింగ్ సదుపాయం కూడా కల్పించడంతో ఈసారి భక్తులు మరింత సౌకర్యవంతంగా తమ ప్రయాణాన్ని పూర్తి చేయవచ్చని ఆర్టీసీ అధికారులు తెలిపారు.
ఇంకా
10.
ఇన్నేళ్లయినా భయపడుతున్నారా.. బాహుబలి దెబ్బకు వెనక్కి తగ్గిన మరో సినిమా.. - 2025-10-29T17:56:22+05:30
ఎస్.ఎస్. రాజమౌళి 'బాహుబలి: ది ఎపిక్' సినిమా అక్టోబర్ 31న విడుదల కానుంది. దీని ప్రభావంతో రవితేజ 'మాస్ జాతర' ఒక రోజు ఆలస్యంగా, విష్ణు విశాల్ 'ఆర్యన్' వారం ఆలస్యంగా విడుదల కానున్నాయి. సినిమా అనేది రేస్ కాదు, సెలబ్రేషన్ అని విష్ణు విశాల్ పేర్కొన్నారు. బాహుబలి హైప్ కారణంగా ఇతర చిత్రాల విడుదల తేదీలు మారాయని సినీ అభిమానులు భావిస్తున్నారు.
ఇంకా