1.
బీసీబీకి ఫుల్ సపోర్ట్ చేసిన పాకిస్థాన్కు.. చుక్కలు చూపిస్తోన్న బంగ్లాదేశ్..భారత్ను దెబ్బకొట్టబోతే, సీన్ రివర్స్! - 2026-03-23T09:26:16+05:30
పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026కు బంగ్లాదేశ్ సడెన్ షాక్ ఇచ్చింది. టీ20 వరల్డ్కప్ వ్యవహారంలో భారత్ - బంగ్లాదేశ్ వివాదం గురించి అందరికీ తెలిసిందే. ఆ సమయంలో భారత్ను దెబ్బకొట్టాలని పాకిస్థాన్.. బంగ్లాదేశ్కు ఫుల్ సపోర్ట్ చేసింది. పాక్ సపోర్ట్తోనే బంగ్లాదేశ్ ఏకంగా టీ20 వరల్డ్కప్ నుంచి బయటకు వెళ్లడానికి కూడా వెనుకాడలేదు. అయితే ఇప్పుడు సీన్ మొత్తం రివర్స్ అయింది. అదే బంగ్లాదేశ్ ఇప్పుడు పాకిస్థాన్కు కనీసం సపోర్ట్ కూడా చేయలేదు. పాకిస్తాన్ సూపర్ లీగ్లో ఆడేందుకు బంగ్లా ప్లేయర్లకు ఇప్పటి వరకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడం గమనార్హం.
ఇంకా
2.
ఏప్రిల్ 1 నుంచి పాన్ కార్డ్ కొత్త రూల్స్.. ఏయే లావాదేవీలపై కొత్త లిమిట్స్ ఎలా ఉన్నాయంటే? - 2026-03-23T08:16:22+05:30
Cash Deposit PAN Limit: భారతీయులకు పాన్ కార్డు అనేది ఎంత ముఖ్యమైన డాక్యుమెంట్ అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చాలా ఆర్థిక అవసరాల్లో ఇది కీలకంగా పనిచేస్తుంది. ఇప్పుడు పాన్ కార్డుకు సంబంధించి కేంద్రం ఇటీవల కొన్ని మార్పులు చేసింది. కొన్ని రకాల ఆర్థిక లావాదేవీలకు సంబంధించి పాన్ కార్డు పరిమితుల్ని సవరించింది. ఇది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది.
ఇంకా
4.
'హార్మూజ్ దాటాలంటే.. రూ.18 కోట్లు చెల్లించాల్సిందే': ఇరాన్ మరో సంచలన నిర్ణయం - 2026-03-23T09:22:10+05:30
ప్రపంచ వాణిజ్యానికి ప్రాణధర లాంటి హార్మూజ్ జలసంధి ఇప్పుడు రణక్షేత్రంగా మారుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన 48 గంటల అల్టిమేటం ముగియకముందే.. ఇరాన్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా ఈ కీలక జలమార్గం గుండా వెళ్లే ప్రతి నౌక నుంచి ఏకంగా 2 మిలియన్ డాలర్ల (భారత కరెన్సీ ప్రకారం సుమారు రూ. 18 కోట్లు) టోల్ ఫీజు వసూలు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే కొన్ని నౌకల నుంచి ఈ డబ్బును వసూలు చేసినట్లు కూడా వెల్లడించింది.
ఇంకా
5.
యువతి కిడ్నాప్ అంటూ ఫోన్.. కారును వెంబడించిన పోలీసులు, తీరా చూస్తే వీకెండ్ పార్టీ అంట - 2026-03-23T09:12:17+05:30
Visakhapatnam Fake Kidnap Call Incident: విశాఖపట్నంలో కిడ్నాప్ పేరుతో వచ్చిన ఓ ఫోన్కాల్తో పోలీసులు పరుగులు పెట్టారు. అయితే మద్యం మత్తులో ఉన్న యువత చేసిన పనితో అందరూ కంగారుపడ్డారు. యువకులు, ఓ యువతి రుషికొండ దగ్గరకు వచ్చి మద్యం సేవించారు. మత్తులో యువకుల మధ్య గొడవ జరిగింది..యువతి పెద్దగా కేకలు వేయడంతో ఓ వ్యక్తి కిడ్నాప్ జరుగుతోందని పోలీసులకు ఫోన్ చేసి చెప్పాడు. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి వారి కారును వెంబడించారు. కానీ చివరికి అసలు సంగతి తెలిసి అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ఇంకా
6.
డిస్కంలకు సింగరేణి షాక్.. రాజస్థాన్కు కొత్త ప్లాంటు కరెంటు, తెలంగాణకు కష్టాలు తప్పవా..? - 2026-03-23T08:38:47+05:30
సింగరేణి సంస్థ మంచిర్యాల జిల్లా పెగడపల్లిలో నిర్మిస్తున్న 800 మెగావాట్ల కొత్త థర్మల్ ప్లాంట్ విద్యుత్తును తెలంగాణకు కాకుండా రాజస్థాన్కు విక్రయించాలని నిర్ణయించింది. ఇందుకోసం రాజస్థాన్ జెన్కోతో జాయింట్ వెంచర్ ఏర్పాటు చేస్తోంది. తెలంగాణ డిస్కంలు చెల్లించాల్సిన రూ. 27,379 కోట్ల భారీ బకాయిలే ఈ నిర్ణయానికి కారణమని తెలుస్తోంది. ఈ పరిణామం భవిష్యత్తులో తెలంగాణకు కరెంట్ కష్టాలతో పాటు వేల కోట్ల అదనపు ఆర్థిక భారాన్ని మోపే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇంకా
7.
మత్స్యకారుల పంట పండింది.. రెండు చేపలకు ధర రూ.లక్షా 94వేలు.. ఎందుకంత ప్రత్యేకం! - 2026-03-23T08:41:11+05:30
Antarvedi Kachidi Fish Huge Rate: వేటకు వెళ్లిన మత్స్యకారుల వలకు రెండు కిచిడి చేపలు చిక్కాయి. కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేది మినీ ఫిషింగ్ హార్బర్లో వేలం పాట నిర్వహించారు. ఏకంగా రూ. లక్షా 94వేలు పలికాయి. ఇవి రెండు ఆడ చేపలు కావడంతో ధర కాస్త తక్కువ పలికింది. వీటిని స్థానిక వ్యాపారి వేలంలో దక్కించుకున్నారు. ఈ చేపలలో ఔషధ గుణాలు ఉంటాయి.. అందుకే వీటికి అంత గిరాకీ ఉంటుందని మత్స్యకారులు చెబుతున్నారు.
ఇంకా
8.
5 కంపెనీలతో ఇన్వెస్టర్లకు రూ. 1 లక్ష కోట్లు లాస్.. లిస్టులో HDFC, TCS.. 5 రోజుల్లో ఇదీ పరిస్థితి! - 2026-03-23T08:54:27+05:30
Top Valued Firms Market Capitalization: ఇరాన్- ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావం ఉన్నప్పటికీ.. గత వారం భారత స్టాక్ మార్కెట్లు పెద్దగా ప్రభావితం కాలేదని చెప్పొచ్చు. ఓవరాల్గా కిందటి వారం సూచీలు ఫ్లాట్గానే ముగిశాయి. అయినప్పటికీ మార్కెట్ విలువ పరంగా టాప్- 10 కంపెనీల్లో 5 కంపెనీల వాల్యూయేషన్ రూ. 1 లక్ష కోట్లకుపైగా తగ్గింది. వీటిల్లో ఆల్ టైమ్ కనిష్ఠాలకు చేరిన హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టీసీఎస్ షేర్లు ఉన్నాయి.
ఇంకా