1.
Ap Elections Live Updates: వైఎస్ జగన్ నామినేషన్.. కడప జిల్లాలో చంద్రబాబు, పవన్ ప్రచారం - 2024-04-25T05:27:22+05:30
AP Assembly Election 2024 News Live Updates: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల హడావిడి కనిపిస్తోంది.. ఇవాళ నామినేషన్ల ప్రక్రియ ముగుస్తోంది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. అలాగే పులివెందులలో జరిగే సభలో పాల్గొంటారు. అలాగే ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. ఇవాళ టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ ఉమ్మడి కడప జిల్లాల్లో పర్యటిస్తున్నారు.. ప్రజా గళం సభల్లో పాల్గొనున్నారు.
ఇంకా
2.
వరంగల్కు ఓఆర్ఆర్, ఎయిర్పోర్టు.. రెండో రాజధాని మాదిరిగా: సీఎం రేవంత్ రెడ్డి - 2024-04-24T23:56:47+05:30
Warangal airport: హైదరాబాద్ తరహాలో వరంగల్ నగరానికి ఔటర్ రింగ్ రోడ్డు, అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణకు వరంగల్ రెండో రాజధాని లాంటిదని అన్నారు. కాకతీయ యూనివర్సిటీని ప్రక్షాళన చేసి నాణ్యమైన విద్య అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. వరంగల్లో నిర్వహించిన కాంగ్రెస్ జనజాతర సభలో ప్రసంగించారు. కడియం కావ్యను గెలిపించాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్పై ఘాటు విమర్శలు చేశారు.
ఇంకా
3.
రిషభ్ పంత్ పవర్ఫుల్ ‘హిట్’.. ఉత్కంఠ పోరులో చివరి బంతికి గుజరాత్పై విజయం - 2024-04-24T23:23:02+05:30
Rishabh Pant: ఐపీఎల్ 2024లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు నాలుగో విజయాన్ని సాధించింది. గుజరాత్ టైటాన్స్పై 4 పరుగుల తేడాతో గెలిచి.. పాయింట్ల పట్టికలో ఆరో స్థానానికి ఎగబాకింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసి డీసీ.. నిర్ణీత 20 ఓవర్లలో 224/4 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం గుజరాత్ టైటాన్స్ బ్యాటర్లు సైతం గొప్పగా పోరాడారు. చివర్లో ఢిల్లీ బౌలర్లు పుంజుకోవడంతో శుభ్మన్ గిల్ టీమ్.. 220/8కు పరిమితమైంది.
ఇంకా
4.
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ వీరాభిమాని - 2024-04-24T22:53:49+05:30
Chevella Lok Sabha Constituency: తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో సినీ గ్లామర్ చాలా తక్కువ. ఉన్నవారు కూడా హీరోయిన్ల కంటే హీరోలే ఉన్నారు. అయితే తాజాగా జరుగుతున్న లోక్సభ ఎన్నికల్లో ఓ నటి పోటీలోకి దిగారు. తెలంగాణలోని చేవెళ్ల నియోజకవర్గం నుంచి ఆమె లోక్సభకు పోటీ చేసేందుకు నామినేషన్ కూడా దాఖలు చేశారు. ఆమెనే మా ఊరి పొలిమేర నటి దాసరి సాహితి.. తాజాగా నామినేషన్ దాఖలు చేశారు. పవన్ కళ్యాణ్ వీరాభిమాని అయిన దాసరి సాహితి.. ఇండిపెండెంట్గానే బరిలోకి దిగుతున్నారు.
ఇంకా
5.
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ - 2024-04-24T21:47:57+05:30
Congress List: తెలంగాణలో మిగిలిన 3 స్థానాలకు.. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. నామినేషన్లు దాఖలు చేసేందుకు గడువు ముగియనున్న ఒకరోజు ముందు ముగ్గురు అభ్యర్థుల పేర్లను కాంగ్రెస్ హై కమాండ్ విడుదల చేసింది. ఖమ్మం, హైదరాబాద్, కరీంనగర్ లోక్సభ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను రిలీజ్ చేశారు. ఇక ఖమ్మం పార్లమెంటు స్థానాన్ని తన బంధువుకు ఇప్పించుకోవడంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సఫలం అయ్యారు.
ఇంకా
6.
AP: పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ - 2024-04-24T22:22:47+05:30
ఏప్రిల్ నెలాఖరు వచ్చింది. మే నెల ప్రారంభానికి మరో వారం రోజులు కూడా సమయం లేదు. దీంతో ఏపీవ్యాప్తంగా ఉన్న పింఛన్ దారుల్లో ఈసారి ఎలా పింఛన్ పంపిణీ చేస్తారనే దానిపై అనుమానాలు ఉన్నాయి. ఏప్రిల్ నెలలో సచివాలయాల ద్వారా పింఛన్ల పంపిణీ జరగ్గా.. ఎండవేడికి తట్టుకోలేక సుమారు 30 మంది వృద్ధులు చనిపోయారు. ఈ నేపథ్యంలో మే నెలలో ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే పింఛన్ల పంపిణీపై చంద్రబాబు ఈసీకి లేఖ రాశారు.
ఇంకా
7.
లోక్సభ ఎన్నికల బరిలో ఖలిస్థానీ ఉగ్రవాది అమృత్పాల్ సింగ్.. జైలులో నుంచే పోటీ - 2024-04-24T23:24:12+05:30
Amritpal Singh: ఖలిస్థానీ ఉగ్రవాది అమృత్పాల్ సింగ్ గుర్తున్నాడా. అదే.. గతేడాది పంజాబ్లో పోలీసులకు కొన్ని రోజుల పాటు ముచ్చెమటలు పట్టించిన వారిస్ పంజాబ్ దే అధినేత. పోలీస్ స్టేషన్పై దాడి చేసి తప్పించుకుపోయిన అమృత్పాల్ సింగ్ను పట్టుకునేందుకు పంజాబ్తోపాటు పలు రాష్ట్రాల పోలీసులు కూడా రంగంలోకి దిగి.. ఎట్టకేలకు అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. అయితే ఇప్పుడు అమృత్పాల్ సింగ్ గురించి ఎందుకు అనుకుంటున్నారా. ఆ అమృత్పాల్ సింగ్ ప్రస్తుతం లోక్సభ ఎన్నికల్లో పోటీకి సిద్ధమయ్యాడు.
ఇంకా
8.
AP Live పోలీస్ కస్టడీకి సీఎం జగన్పై రాయిదాడి కేసు నిందితుడు సతీష్ - 2024-04-24T05:34:39+05:30
AP Assembly Election 2024 News Live Updates: ఆంధప్రదేశ్ ఎన్నికల్లో నామినేషన్ల ప్రక్రియ మరో రెండు రోజుల్లో పూర్తి కానుంది. ఈ నెల 29 నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ. ఇటు ముఖ్యమంత్రి వైెఎస్ జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర ముగియనుంది. ఇటు కూటమి తరఫను చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు ఉమ్మడిగా ప్రచారం నిర్వహించనున్నారు. పోలింగ్కు మరో 20 రోజుల సమయం మాత్రమే ఉండటంతో అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఏపీ ఎన్నికల లైవ్ అప్డేట్స్ ఇలా ఉన్నాయి.
ఇంకా
9.
మత్స్యకారుల సుడి తిరిగింది.. వలలో పడిన బంగారు చేపలు.. ఏకంగా లక్షల్లో.. - 2024-04-24T21:53:20+05:30
Kachidi Fish: అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కొంతమంది మత్స్యకారుల పంట పండింది. గాలమేస్తే ఏకంగా గోల్డెన్ ఫిష్ వలలో పడ్డాయి. మొత్తం 28 కచిడీ చేపలు వలలో చిక్కాయి. వీటిని అంతర్వేది మినీహార్బర్లో వేలం వేయగా రికార్డు ధర పలికాయి. ఏప్రిల్ 15 వ తేదీ ఈ ఘటన జరగ్గా.. వివరాలు కాస్త ఆలస్యంగా తెలిశాయి. మొత్తానికి గోల్డెన్ ఫిష్లు వలలో పడటం, రికార్డు స్థాయిలో 41 లక్షలు ధర పలకడంతో ఆ మత్స్యకారుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
ఇంకా
10.
ఓటర్లకు ర్యాపిడో గుడ్న్యూస్.. పోలింగ్ రోజు వారికి ఉచిత ప్రయాణాలు - 2024-04-24T20:22:49+05:30
Rapido: ప్రస్తుతం దేశంలో ఎక్కడ చూసినా సార్వత్రిక ఎన్నికల గురించే చర్చ జరుగుతోంది. ఇక ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అనేక రకాల చర్యలను చేపడుతోంది. ఈ నేపథ్యంలోనే రైడ్ షేరింగ్ సంస్థ ర్యాపిడో సంచలన ప్రకటన చేసింది. ఓటింగ్ రోజు ఉచిత ప్రయాణాలు కల్పించనున్నట్లు ప్రకటించింది. ఓటర్లను ఇంటి దగ్గరి నుంచి పోలింగ్ స్టేషన్ల వరకు ర్యాపిడో వాహనాలపై ఉచితంగా చేరవేయనున్నట్లు తెలిపింది. అయితే ఈ అవకాశం కొందరికే అని తెలిపింది. ఆ కొందరు ఎవరో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఇంకా