కన్నా తో ఉన్నా అనిపించినా, చంద్రన్న నీడలో, పవన్ తోడులో, వికసించని ఆంధ్రా కమలం - Politics - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2076 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2111 General Articles and views 1,868,825; 104 తత్వాలు (Tatvaalu) and views 225,174.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
* బీజేపీ రాష్ట్ర నాయకత్వం కూడా, ఇక జన్మ లో రాని అలాంటి మంచి అవకాశం ను, ఉపయోగించుకోలేక పోవడం శోచనీయం.

* చంద్రన్న ఎంపీలు జగన్ తో చేరరు, ఎమ్మెల్యేలు బీజేపీ తో చేరరు, అదే చిత్ర విచిత్రమైన గమ్మత్తు.

* ఇలాంటి ప్రతిపక్షం దొరకడం, నిజంగా జగన్ చేసుకున్న అద్రృష్టం.

చదవండి సున్నితమైన విమర్శలు నుంచి పరిష్కారాలు.
1 min read time.

రాజకీయాలు అంటే బయటవి కావు. మన ఇంట్లో, మన ఆఫీసు లో, మన బంధువులు లో ఉండే రాజకీయాలే, పార్టీలు లో ఉంటాయి. అవి తెలిసిన, ఇవి తెలుస్తాయి.

మంచి వాళ్ళు దూరంగా ఉంటే, పరిస్థితి ఇలాగే ఉంటుంది. మరలా నా దేశం, నా రాష్ట్రం చెడిపోతున్నది అని, మొసలి కన్నీళ్లు, మనలో మార్పులు లేకుండా నే.

అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడు నోట్లో శని ఉంటే, ఏమీ ఉపయోగం లేదు అన్నట్టు సామెత విన్నాము కదా. బీజేపీ ఆంధ్రా లో, సొంతంగా ఒక్క సీటు గెలిచే పరిస్థితి లో, ఎప్పుడూ లేదు, ఇక కూడా ఉండదు. ఎందుకంటే సొంత పార్టీ వారే, పార్టీ ని ఎదగనీయరు. అందరూ చంద్రన్నతో చెట్టాపట్టాలేసుకుని, పబ్లిక్ గా లేదా చాటుగా తిరుగుతూ, పార్టీ ని భూస్ధాపితం చేశారు, చేస్తున్నారు, చేస్తారు.

వీర్రాజు గారి లాంటి నిజాయితీ నిబద్దత గల వారి నోరు నొక్కేస్తారు. జనాకర్షణ మరియు గట్టి కంఠము గలిగిన నాయకులు, ఒకరూ లేరు, అదో పెద్ద శాపము.

గతములో కొన్ని సీట్లు గెలిచినా, అవి పొత్తుతో మాత్రమే. మాస్ లీడర్ మరియు గట్టి మాటల వక్తలు లేరు. పవన్ దొరికినా, సరిగ్గా వాడుకోవడము లేదు.

తెలంగాణాలో కనీసం కొన్ని సీట్లు అయినా గెలిచింది, బలమైన తిరుగులేని కేసీయార్ ను తట్టుకుని కూడా. Telangana BJP - 4 MP seats - Adilabad - Soyam Bapu Rao, Karimnagar - Bandi Sanjay Kumar, Nizamabad - Arvind Dharmapuri, Secunderabad - G. Kishan Reddy. Assembly 21 seats.

కానీ చంద్రన్న నీడ ఉన్నంత కాలం ఎదగదు, ఏ రాష్ట్ర బీజేపీ నాయకుడు ఉన్నా, ఇంచె కూడా వికసించదు. ఇందులో ప్రత్యేకముగా కన్నా గారిని తప్పు పట్టాల్సిన పని లేదు. కన్నా గారు కష్టపడుతున్నారు ఇప్పుడు, జగన్ ప్రభుత్వము వచ్చాక.

మోడీ అమిత్ షా లాంటి బలమైన నాయకులు కేంద్రం లో ఉన్నా కూడా, దేశమంతా బీజేపీని పొగిడి గెలిపించిన, ఈ రెండో దశలో కూడా, రాష్ట్ర పార్టీ ప్రాభవాన్ని పెంచలేకపోయారు. రాష్ట్ర నాయకత్వం కూడా, ఇక జన్మ లో రాని, అలాంటి మంచి అవకాశం ను, ఉపయోగించుకోలేక పోవడం శోచనీయం.

చంద్రన్న భక్తులు అందరూ, కమలాన్ని నమ్మారా, కమలం నీడలో ఒదిగారా, అంటే అదీ లేదు. ఎంపీలు ఏమో కేంద్ర మోడీ వైపు దూకుతున్నారు, బాగా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు అని, ఎమ్మెల్యేలు మాత్రమే రాష్ట్ర జగన్ వైపు రాసుకుంటున్నారు, మరలా అదే మాటలు చెపుతూ. అంటే ఎక్కడ అధికారం లో ఎవరు ఉంటే, వారి వైపు మాత్రమే ఉంటారు, తమ సొంత రక్షణ మరియు అవసరం కోసం. జనం వైపు లేదా గెలిచిన పార్టీ వైపు, మాత్రం ఉండరు. ఎంపీలు జగన్ తో చేరరు, ఎమ్మెల్యేలు బీజేపీ తో చేరరు, అదే చిత్ర విచిత్రమైన గమ్మత్తు.

అంటే నీతి లేనిది ఎమ్మెల్యే, ఎంపీలు కు మాత్రమే అందామా? లేదా అలాంటి అవకాశ వాదులను ఎంపిక చేసిన లేదా తయారు చేసిన చంద్రన్న ను అందామా? లేదా అక్కున చేర్చుకుంటున్న రాష్ట్ర బీజేపీ మరియు జగన్ ను అందామా? లేక అలాంటి వారిని గెలిపించిన, ప్రజలను అందామా? ఎందుకంటే జనం కు తెలిసే గెలిపించారు కదా, గెలిచిన తర్వాత జంపింగ్ ఉంటుంది అని. అందరూ తగ్గ వారే, అందుకే యధా ప్రజా, తధా రాజా.

కాబట్టి, చంద్రన్న ఎంపీలు బిజెపి తో ఉన్నంతకాలం, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా గారు గానీ, కేంద్ర నాయకులు కానీ, కమలాన్ని ఎంత బలవంతంగా అయినా, ఇంచె కూడా పెంచలేరు, సొంతంగా ఒక్క సీటు సంపాదించలేరు. జనం దృష్టిలో, చంద్రన్న కు మరియు వారి ఎంపీలు కు, సురక్షిత వనవాస సంక్షేమ కేంద్రం, మన రాష్ట్ర బీజేపీ. నీతి విలువ లకు, ఎక్కడ ఎవరి దగ్గరా స్ధానం లేదు.

సరే చంద్రన్న, రాష్ట్ర బీజేపీ బంధం పక్కన పెడితే, ఈ మధ్య కాలంలో రాష్ట్ర బీజేపీ, గతంలో చంద్రన్న ప్రభుత్వం లో కన్నా, ఎక్కువ ప్రభుత్వ వ్యతిరేక ధర్నాలు కార్యక్రమాలతో ఉనికిని చాటుకోవడానికి ప్రయత్నం చేస్తోంది, కన్నా లక్ష్మీ నారాయణ గారి నాయకత్వం లో.

మొన్న టీటీడీ ఆస్తుల అమ్మకాలు మీద, కరెంటు ఛార్జీలు పెంపకం మీద, విశాఖ గాస్ మీద, జగన్ అవినీతి అలసత్వం మీద ధర్నా లు చేస్తూ , ప్రజలకు అండగా ఉండే ప్రయత్నం చేస్తున్నారు.

బీజేపీ జనసేన తోడుగా కలసి కొన్ని కార్యక్రమంలో పాల్గొన్నారు, కానీ అన్ని కార్యక్రమాలు లో కలవలేకపోతున్నారు, సమన్వయం కుదరడం లేదు, క్రింద స్ధాయి కార్యకర్తలు దాకా అది వెళ్ళడం లేదు, వారూ ఒప్పుకోవడము లేదు.

ఎందుకంటే, ఒక కార్యక్రమంలో సుజనా లేదా ఇంకో చంద్రన్న ఎంపీ గారు వచ్చి, చంద్రన్నకు అనుకూలంగా మాట్లాడుతూ ఉంటే, జన సైనికులకు నచ్చదు. అలాగె చంద్రన్న ను జనసేన గట్టిగా అందాము అంటే, వారికి నచ్చదు. కన్నా గారికి నచ్చిన నచ్చకపోయినా, పార్టీ లో వారిని చేర్చుకున్నాక తప్పదు, భరించాలి.

పవన్ కూడా మరలా సినిమా లు అంటున్నారు కొంత సమయము. చంద్రన్న కూడా హైదరాబాద్ అమరావతి మధ్యలో తిరుగుతూ, అటు వ్యాపారం చూసే కుటుంబం కు , ఇటు రేపు ఓట్లు కు అవసరం అయ్యే జనం కోసం, పెద్ద వయసు లో ఇబ్బంది పడుతున్నారు, ఎటూ సరి చేసుకోలేక, ప్రతిపక్ష నేత హోదా కోల్పోతాము అన్న భయముతో.

ఇలాంటి ప్రతిపక్షం దొరకడం, నిజంగా జగన్ చేసుకున్న అద్రృష్టం. ఎప్పుడూ లాగా నే, జగన్ తన స్వయం క్రృతాపరాధం వలన గద్దె దిగాలేమో గానీ, ప్రతిపక్ష ధర్నా ల వలన మాత్రం కాదు కదా. జగన్ కు 150 సీట్లు పైన వచ్చాయి అంటే, చంద్రన్న మీద జనము ఎంత విసిగి పోయి ఉన్నారో ఉదాహరణ కదా.

ఇప్పటికైనా, జనసేన బీజేపీ కలిసి, ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపుతూ, ప్రజలకు అండగా ఉండి మంచి చేస్తూ, జనము లో ఉంటూ తిరుగుతూ, చంద్రన్న నీడ నుంచి బయటకు వచ్చి, సొంత శక్తి ని జనమును పెంపొందించుకుంటారు అని, మోడీ కి అండగా ఉంటారని, మంచి మనసుతో ఆశిద్దాము.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2111 General Articles and views 1,868,825; 104 తత్వాలు (Tatvaalu) and views 225,174
Dt : 12-Jun-2020, Upd Dt : 12-Jun-2020, Category : Politics
Views : 1014 ( + More Social Media views ), Id : 581 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : kanna , pawan support , no blossom , andhra bjp , chandranna , shadow , jagan , modi , amitsha , Telangana
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content